వరంగల్ లీగల్ : ప్రేమ పేరుతో పరిచయం ఏర్పరచుకొని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు మోసం చేసిన వ్యక్తికి న్యాయస్థానం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన బాధితురాలితో మండిబజారుకు చెందిన జన్మ శ్యాంసుందర్ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రేమ పేరుతో తొమ్మిది సంవత్సరాలు పరిచయం కొనసాగించాడు.పెండ్లి చేసుకుంటానని సదరు యువతిని మోసం చేశాడు.
యువతి నిలదీయడంతో పెండ్లి చేసుకుంటానని నమ్మించి స్థానిక కోటిలింగాల దేవాలయంలో పూలమాలవేసి మరుసటి రోజు నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఇంతేజారగంజ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కేసు దర్యాప్తు చేశారు.
నేరాన్ని రుజువు చేసేందుకు కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ అనిల్ కుమార్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాధారాలు పరిశీలించిన 9వ అదనపు జిల్లా జడ్జి ముక్తిదా నిందితుడికి రెండు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పనిచ్చారు.
ఇవి కూడా చదవండి..
వరంగల్లో ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు
చెరువులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణాధారం
పల్లె ప్రగతికి సహకరిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
న్యూజిలాండ్ సెలబ్రేషన్స్ చూసి తట్టుకోలేకపోయాం: అశ్విన్