రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో (పికప్ వాహనం) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. రాజానందగావ్ జిల్లా అర్జునీగ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసే కార్మికులు పనులు ముగించుకొని స్వగ్రామం రైతాపల్లికి వస్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని డోంగార్గావ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజానందగావ్ మెడికల్ కళాశాల దవాఖానకు పంపారు. అతివేగం కారణంగా డ్రైవర్ వాహనంపై పూర్తిగా నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బాధిత కుటుంబీలకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.