ఖమ్మం : ఖమ్మంలోని మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా నలుగురు వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టు పడ్డారు. పట్టుబడ్డవారిలో నగరానికి చెందిన జోగుపర్తి నాగేశ్వరరావు, వజ్రపు వెంకటేశ్వర్లు, షేక్ హుస్సేన్, మామిడాల రవిలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 16వేల రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుని, వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు.