హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ వద్ద కాంక్రీట్ మిక్సర్ లారీ బీభత్సం సృష్టించింది. రెండు బైక్లు, ట్రాక్టర్ను ఢీకొనడంతో బైక్లపై ఉన్న ముగ్గురు, ట్రాక్టర్పై ఉన్న ఓ వ్యక్తి మరణించాడు.
సికింద్రాబాద్లో భవనం పైనుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. అల్వాల్ పరిధి భూదేవి నగర్లో అమ్ములు(54) అనే మహిళ భవనం పైనుంచి పడి చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.