హైదరాబాద్ నడిరోడ్డుపై వ్యక్తి హత్య కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం చాంద్రాయణగుట్ట హషీమాబాద్లో ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా దుండగులు దాడి చేశారు. కారును ఆపి అందులోని వ్యక్తి బయటకు లాగి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు బైకులు, నాలుగు ఫోన్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.