హైదరాబాద్ : పెళ్లి పత్రికలో పేర్లు లేవన్న కారణంతో కుటుంబీకులు రెండువర్గాలుగా విడిపోయి పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సికింద్రాబాద్ పరిధిలోని తుకారాంగేట్ పరిధిలోని చంద్రశేఖర్ నగర్లో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గాయపడిన ఎస్ ప్రవీణ్ (30) నోముల పరశురాము(35) డీ యాదగిరి, (42) ఎన్ ప్రతాప్ కుమార్ (32)ను పోలీసులు చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. వీరిలో ఎస్ ప్రవీణ్, నోముల పరశురాము పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.