దౌల్తాబాద్ : కారు, బైక్ ఢీకొని నలుగురికి గాయాలైన సంఘటన దౌల్తాబాద్ మండలంలోని చెల్లాపూర్ గ్రామ స్టేజీ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాయిలు కుటుంబ సభ్యులతో కలిసి బిజ్జారంలో జరిగే వివాహనికి బైక్పై బయదేరాడు. కొడంగల్ మండలం రావులపల్లి గ్రామం నుంచి దౌల్తాబాద్ మీదుగా కోస్గికి వెళ్తున్న కారు, చెల్లాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో రెండు వాహనాలు ఎదురేదురుగా ఢీ కొన్నాయి.
దీంతో బైక్పై ప్రయాణిస్తున్న సాయిలు తల, కాలుకు గాయం కాగా భార్యకు రెండు కాళ్లు విరిగి ఎడమచేయి మడికట్టు దగ్గర విరిగింది. అదే విధంగా కూతురుకు ఎడమకాలు విరుగగా కుమారుడికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు చికిత్స నిమిత్తం కోస్గి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితుడు సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.