అదనుచూసి రూ.50 లక్షలతో ఉడాయింపు
మూడు బృందాలుగా పోలీసుల గాలింపు
డ్రైవర్తో పాటు అతని సోదరుడి అరెస్టు
రూ: 40.50 లక్షల చోరీ సొత్తు రికవరీ
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12: రూ.50 లక్షలతో పరారై ఓ కారు డ్రైవర్ తన యజమానికి టోకరా ఇచ్చాడు. షాపింగ్ వెళ్లొచ్చిన యజమాని విషయాన్ని గమనించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు చోరీకి పాల్పడిన నిందితుడితో పాటు అతనికి సహరించిన సొదరుడిని సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ:40.50 లక్షల చోరీ సోత్తును రికవరి చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ వెంకటేశ్వర్లు సోమవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో వెల్లడించారు. కర్ణాటక-మీర్జాపూర్ ప్రాంతానికి చెంది న హనుమంత్ దోత్రే(52) నగరానికి వలస వచ్చి కూకట్పల్లి సర్దార్పటేల్ నగర్లో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వైఎస్ ప్రసాద్ వద్ద రెండు నెలల క్రితం కారు డ్రైవర్గా పనిలో చేరాడు.
ఈ నెల 3న రాత్రి 8:30 గంటల సమయంలో కారు యాజమాని ప్రసాద్ తన వ్యాపార భాగస్వాములు ధీరజ్రెడ్డి, వైఎన్ బీర్రాజులతో కలిసి తన కారులో రూ: 50 లక్షల బ్యాగుతో షాపింగ్ నిమిత్తం ఇనార్బిట్ మాల్కు వెళ్లాడు. చాన్స్ కోసం ఎదురుచూస్తున్న డ్రైవర్ హనుమంత్ యజమాని వైఎస్ ప్రసాద్, ధీ రజ్ రెడ్డి, బీర్రాజులను మాల్ ప్రవేశ ద్వారం వద్ద దించి యజమాని సూచన మేరకు కారు పార్కింగ్లోకి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన హనుమం తు కారులో డబ్బున్న బ్యాగు తీసుకొని ఉడాయించాడు. కాసేపటికి పని ముగించుకొని ముగ్గురు భాగస్వాములు బయటకు వచ్చారు. వైఎన్ ప్రసాద్ డ్రైవర్ హనుమంత్ కాల్ చేయగా, అతని ఫోన్ స్విచ్చాప్ వచ్చింది. అనుమానంతో కారు పార్కింగ్లోకి వెళ్లి చూడగా, కారు పార్కింగ్లో ఉంది. కా రు తాళపు చెవులు సైతం కారు డ్యాష్బోర్డులో ఉన్నాయి. కానీ, డబ్బున్న బ్యాగు మాత్రం కనిపించలేదు. దీంతో కారు యజమాని ప్రసాద్ వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇన్స్పెక్టర్ రవీంద్రప్రసాద్ పర్యవేక్షణలో మూ డు బృందాలు హైదరాబాద్, షోలాపూర్, షిరిడి, ముంబై ప్రాంతాలకు వెళ్లి జల్లెడ పట్టారు. నిందితుడి సెల్ఫోన్ సిగ్నల్స్ను కనిపెడుతుండగా, ఈ నెల 11న హనుమంత్ జహీరాబాద్లో సెల్ఫోన్ స్విచ్చాన్ చేసినట్లు గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ హనుమంత్తో పాటు అతని సోదరుడు లక్ష్మణ్ను సైతం అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు రూ:40.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇనార్బిట్ మాల్లో డబ్బుల బ్యాగుతో ఉడాయించిన హనుమంత్ నేరుగా, అక్కడి నుంచి ఆటోలో లింగంపల్లి వెళ్లినట్టు దర్యాప్తులో తేలిందని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. లింగంపల్లి నుంచి బస్లో ముంబై వెళ్లి తన సోదరుడు లక్ష్మణ్కు జరిగిన విషయం చెప్పాడు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి సదరు చోరీ డబ్చులతో రియల్ ఏస్టేట్ వ్యా పారం చేయాలనుకున్నారు. ఇందులో రెండు లక్ష లు వారి అప్పుల తాలూకు బకాయిలు చెల్లించగా, మరికొంత డబ్బును ఇతర ఖర్చులకు వెచ్చించిట్లు పేర్కొన్నారు. మిగిలిన డబ్బులు తన భార్య వద్ద దాచి ఉంచాడు. మాదాపూర్ ఏసీపీ రఘునందన్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, డీఐ నవీ న్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.