దోమ : భూమి రిజిస్ట్రేషన్కు తాసిల్దార్ అడ్డుపడుతున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దోమ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన హరిజన్ సత్తయ్యకు సర్వే నంబరు 43లో ఒక ఎకరా 20 గుంటల భూమి ఉన్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో ఒక ఎకర పొలం భూమిని అమ్మడానికి అగ్రిమెంట్ చేశాడు. అట్టి భూమిని రెండుసార్లు స్లాట్బుక్ చేసుకుంటే తాసిల్దార్ నిలిపివేశారు. ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తాసిల్దార్ నిరాకరించింది. అట్టి భూమిని రిజిస్ట్రేషన్ చేయరాదని హరిజన్ నారాయణ ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని రైతు సత్తయ్య కోరగా ఆధారాలు ఏమి లేవని తేలింది.
ఆధారాలు నిరూపించనప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని బాధిత రైతు తాసిల్దార్ను నిలదీయగా డీటీకి లాగిన్ ఇచ్చాను చేయించుకొండని సమాదానం చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. ఈ విషయంపై డీటీ రాజేందర్రెడ్డీని వివరణ కోరగా నాకు ఎలాంటి విషయం తెలువదని సమాధానం చెప్పడంతో తాసీల్దార్ ఉద్దేశ పూర్వకంగానే భూమి రిజిస్ట్రేషన్ ఆపుతున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగులబెట్టుకుంటానని అనగా తగలబెట్టుకో అన్నారని బాధితుడు తెలిపారు. దీంతో బాధిత రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నా నికి యత్నించగా రైతులు, పోలీసులు పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. ఈ విషయంపై డిటి రాజేందర్రెడ్డిని వివరణ కోరగా అట్టి భూమిలో వారి వారసుల పేర్లు వచ్చాయని వారి వ్యతిరేకి ఫిర్యాదు మేరకే రిజిస్ట్రేషన్ చేయలేదని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధిత రైతుకు న్యాయం చేస్తామని చెప్పారు.