ముంబై , జూన్ 14 :రేపటి నుంచి బంగారు ఆభరణాలు, వస్తువులపై హాల్మార్కింగ్ తప్పనిసరి. రేపటి నుంచి ఈ విధానం అమలు చేయనున్నది కేంద్రప్రభుత్వం. అంతకుముందు జూన్ 1 గడువు ఇవ్వగా, దీనినికరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో పదిహేను రోజులు పొడిగించారు. కేంద్రం గోల్డ్ జ్యువెల్లరీ హాల్ మార్కింగ్ నిబంధనల అమలును ఇప్పటికే పలుమార్లు పొడిగించింది. ఈ ఏడాది జనవరిలో గోల్డ్ హాల్ మార్కింగ్ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ గడువును జూన్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత జూన్ 15కు పొడిగించింది. హాల్ మార్క్ లేకుండా రేపటి నుంచి బంగారు ఆభరణాలు,వస్తువులు విక్రయించడానికి వీలు లేదు. సరైన సమన్వయాన్ని నిర్ధారించడానికి , అమలుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ తివారీ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
అసలు గోల్డ్ కు హాల్మార్కింగ్ ఎందుకు ..? ప్రభుత్వం హాల్మార్క్ వేసిన ఆభరణాలను మాత్రమే అమ్మడం ఎందుకు తప్పనిసరి చేసిందంటే.
-గోల్డ్ హాల్మార్కింగ్ అనేది బంగారు ఆభరణాలు లేదా వస్తువుల నాణ్యత ,స్వచ్ఛత ను తెలిపే ధృవీకరణ.
-2021 , జూన్15 నుంచి 14, 18 , 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే విక్రయించడానికి అనుమతి ఉంటుంది.
-బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా బంగారు ఆభరణాలు ,వస్తువులపై తప్పనిసరిగా హాల్మార్క్ చేయడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలి.
-హల్ మార్క్ ఉంటే ఇటు కస్టమర్, అటు బంగారం వ్యాపారి ఇద్దరికీ ప్రయోజనం. పసిడి నాణ్యతపై ఎలాంటి సందేహాలు ఉండవు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్)హాల్మార్కింగ్ స్కీంలో ఆభరణాలకు రిజిస్ట్రేషన్ మంజూరు, అస్సైయింగ్ అండ్ హాల్ మార్కింగ్(ఏహెచ్)కు గుర్తింపు ఉంటుంది.
-బీఐఎస్ ఇప్పటికే ఏప్రిల్ 2000 నుంచి బంగారు ఆభరణాల కోసం హాల్మార్కింగ్ స్కీమ్ ను అమలు చేస్తున్నది..గత ఐదేళ్లలో అస్సేయింగ్, హాల్మార్కింగ్ కేంద్రాల్లో 25 శాతం పెరుగుదల ఉంది.
పిటిఐలో ఒక నివేదిక ప్రకారం… పలుదేశాల్లో ఏడాదిలో సుమారు 14 కోట్ల ఆభరణాలను హాల్మార్క్ చేస్తున్నారు.
-ప్రస్తుతం 40 శాతం బంగారు ఆభరణాలను మాత్రమే హాల్మార్క్ చేస్తున్నారు.
-బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ప్రకారం.. హాల్మార్కింగ్ అనేది ఆభరణాలపై గుర్తించిన విధంగా వినియోగదారులకు స్వచ్ఛతను పొందేలా చేస్తుంది.
-వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం…భారతదేశంలో సుమారు 4 లక్షల మందికి ఆభరణాలు ఉన్నాయి, వాటిలో 35,879 మందికి మాత్రమే బిఐఎస్ సర్టిఫికేట్ లభించింది.