లక్నో: పొలం దున్నే ట్రాక్టర్ యంత్రం కిందపడి ఒక బాలుడు మరణించగా ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని షాజహన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మౌ షాజహన్పూర్ గ్రామానికి చెందిన కొందరు బాలురు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్తో పొలం దున్నేందుకు వెళ్లారు. కాగా, ట్రాక్టర్పై కూర్చొన్న షాని అనే బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడ్డాడు. దున్నే యంత్రంలో చిక్కుకుని చనిపోయాడు.
దీంతో భయాందోళన చెందిన మిగతా పిల్లలు ఆ బాలుడి కుటుంబానికి ఈ విషయం చెప్పారు. అనంతరం వారంతా కలిసి బాలుడి మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టారు. మరోవైపు ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో బాలుడి కుటుంబానికి చెందిన ఫకీర్ లాల్, దినేశ్తోపాటు ఆకాష్, జితేంద్ర, శివ అనే ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేశారు. వారంతా పరారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.