సైదాబాద్ : సైదాబాద్ సింగరేణికాలనీలో అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సుబ్బిరామి రెడ్డి కథనం.. ప్రకారం సింగరేణికాలనీలో నివసించే ఐదుగురు వ్యక్తులు గత కొంతకాలంగా అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
వినాయక నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా గుడిసెల్లో మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద మద్యం బాటిళ్లను స్వాధీన పర్చుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సైదాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.