నిజామాబాద్ : జిల్లాలోని వర్ని మండల కేంద్రం శివారులోని కుంటలో ఆదివారం విష ప్రయోగంతో చేపలు మృతి చెందాయి. కుంటను వేలంలో దక్కించుకున్న కాంట్రాక్టర్ లక్ష్మణ్ కథనం ప్రకారం… గుర్తు తెలియని వ్యక్తులు కుంటలో చేపలపై విష ప్రయోగం చేసిన కారణంగా సుమారు లక్ష రూపాయల విలువ చేసే చేపలు మృతి చెందాయని తెలిపారు.
సత్యనారాయణపురం గ్రామ పంచాయతీకి చెందిన కుంటను రూ. రెండు లక్షలకు వేలంలో దక్కించుకున్నట్లు లక్ష్మణ్ చెప్పాడు. కుంటలో చేపల పెంపకానికి గాను విత్తనాలను వేశానని అవి ప్రస్తుతం పెరిగి పెద్దవి అయినట్లు తెలిపారు.
తనంటే గిట్టని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని వర్ని సహకార సంఘం మాజీ అధ్యక్షుడు నేమాని వీరాజు పరిశీలించారు.
ఇవి కూడా చదవండి..
వనపర్తి రోడ్డు ప్రమాదంలో మరొకరి మృతి
Mothers Day : అమ్మ ఆరోగ్యం కోసం కూతురు పోరాటం
మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరోనా పాజిటివ్
భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత