ఇస్లామాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 2021 సీజన్లోని మిగతా మ్యాచ్లను జూన్ 9 నుంచి నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. ఫైనల్ జూన్ 24న జరగనుంది. ఇందులో ఆరు డబుల్ హెడర్లు ఉన్నాయి. టోర్నీ మొదటి దశలో 15 మ్యాచ్లు సాధ్యమయ్యాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జూన్ 9 నుంచి లీగ్ తిరిగి ఆరంభంకానుంది. లాజిస్టిక్స్, ఆపరేషనల్ సమస్యల కారణంగా టోర్నీ ఆరంభం ఆలస్యమైంది. లీగ్లో పాల్గొనేందుకు ఆయా ఫ్రాంఛైజీలు సన్నద్ధమవుతున్నాయి.