ముంబై : ప్రభుత్వ ఆస్పత్రికి భోజనం సరఫరా చేసే ఓ కాంట్రాక్టర్పై మహారాష్ర్ట మంత్రి బచ్చు కాడు చేయి చేసుకున్నారు. అకోలాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిని సోమవారం సాయంత్రం మంత్రి బచ్చు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ రోగులకు వడ్డిస్తున్న భోజనాన్ని మంత్రి పరిశీలించారు. ఆ భోజనంలో పూర్తిగా నాణ్యత లోపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి.. అక్కడే ఉన్న కాంట్రాక్టర్పై చేయి చేసుకున్నారు. నాణ్యత లేని భోజనం ఎందుకు సరఫరా చేస్తున్నారని ఆ కాంట్రాక్టర్ను మంత్రి ప్రశ్నించగా, సరైన సమాధానం రాలేదు. భోజనం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై విచారణ జరపాలని అధికారులను మంత్రి బచ్చు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..