న్యూఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవం వేళ దేశ రాజధాని నగరంలో విషాదం చోటుచేసుకున్నది. ఢిల్లీలోని ఓ హోటల్లో మంటలు చెలరేగి కలకలం సృష్టించింది. మంటలను ఆర్పేసిన తర్వాత రెండు మృతదేహాలను ఫైర్ సిబ్బంది గుర్తించారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. మంటలను ఆర్పడంలో 8 వాహనాలు నిమగ్నమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణమేంటో తెలియదని పోలీసులు చెప్తున్నారు.
ఢిల్లీ ద్వారకాలోని కృష్ణ హోటల్లో (Delhi Fire) ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. అనేక మంది కస్టమర్లు లోపల చిక్కుకున్నారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీశారు. ఉదయం 7.25 గంటల సమయంలో కృష్ణ హోటల్లో మంటలు ప్రారంభమయ్యాయి. మంటలను ఆర్పేందుకు 8 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ద్వారకా సౌత్ పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని హోటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషిచేశారు. మంటలను ఆర్పివేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ మెట్ల మీద రెండు మృతదేహాలు కనిపించాయి. ఫోరెన్స్క్ బృందాలు వేలిముద్రలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని, అరగంట తర్వాత విద్యుత్ తిరిగి వచ్చిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఉదయం 7 గంటలకు తాను నిద్ర లేచినప్పుడు హోటల్ లోపల పెద్దగా పొగలు, గ్రౌండ్ ఫ్లోర్, రిసెప్షన్ ఏరియాలో మంటలు కనిపించాయని ఆయన తెలిపారు. ఈ హోటల్ను ఓయో సంస్థ నిర్వహిస్తున్నది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడం విశేషం.
ఎన్సీసీ క్యాడెట్ల మనుసు దోచిన మోదీ
ఇండియన్స్కు జో బైడెన్ విషెస్
శ్రీనగర్లో 100 అడుగుల త్రివర్ణ పతాకం
నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
టీ20 వరల్డ్ కప్కు ఐసీసీ మార్గదర్శకాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..