‘పల్లెప్రగతి’తో ఊరికి సరికొత్త రూపు
పూర్తయిన వైకుంఠధామం, డంపింగ్ యార్డు
ప్రకృతివనాలు, రోడ్లకిరువైపులా ఏపుగా పెరుగుతున్న మొక్కలు
పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన వాతావరణం
నల్లబెల్లి, ఏప్రిల్ 4 : వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట పల్లెప్రగతి కార్యక్రమంతో సరికొత్తగా రూపుదిద్దుకున్నది. నెలనెలా ప్రభుత్వం ఇస్తున్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. డంపింగ్ యార్డు, వైకుంఠధామం పనులు పూర్తయ్యాయి. కన్నారావుపేట దాని పరిధిలో పద్మాపురంలో రెండు ప్రకృతివనాలు ఏర్పాటు చేసి మొక్క లు నాటారు. అలాగే గ్రామంలో రోడ్లకిరువైపులా నాటిన మొక్కలకు ప్రతి రోజూ నీళ్లు పోస్తుండడంతో ఏపుగా పెరుగుతున్నాయి. జీపీ సిబ్బంది క్రమం తప్పకుండా ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి డంపింగ్ యా ర్డుకు తరలించడం, రోడ్లను పరిశుభ్రంగా ఉంచడం.. బహిరంగ మలవిసర్జనను నిషేధించడంతో గ్రామంలో ఆరోగ్యకరమైన వా తావరణం నెలకొంది. హరితహారం కోసం నర్సరీలో 11వేల మొక్కలు పెంచుతున్నారు. ప్రతి రోజూ ఇంటింటికీ భగీరథ నీరు అందుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్యార్డు ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు పాలకవర్గం సమాయత్తమవుతున్నది.
ఇవి కూడా చూడండి..
పక్కా ప్లాన్ ప్రకారమే మెషిన్ గన్లు, దేశీ రాకెట్లతో నక్సల్స్ దాడి..!
థర్మల్ విద్యుత్ కేంద్రంలో పేలిన బాయిలర్.. 13 మందికి తీవ్రగాయాలు