వికారాబాద్ : రైతువేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మంగళవారం పరిగి మండలంలోని రంగాపూర్, రాపోల్, సయ్యద్పల్లి, చిగురాల్పల్లి గ్రామాలలో నిర్మాణం చేపట్టిన రైతువేదికలను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. పంటలు సాగు చేసేందుకు అవసరమైన పెట్టుబడి సహాయం దగ్గర నుంచి పండించిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వరకు ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలు ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందాయని అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా రైతులకు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయం ఎకరాకు రూ.5వేలు అందజేశారని చెప్పారు. రైతులు అప్పులు చేయకుండా పంటల సాగు చేపట్టాలన్నది సర్కారు ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగిందన్నారు.
రైతువేదికల నిర్మాణం ద్వారా రైతులు ఒక దగ్గర కూర్చొని పంటల సాగు, మార్కెటింగ్ తదితర అంశాలు చర్చించుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, జెడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ మేడిద రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర