ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భాండప్ ప్రాంతంలోని ఓ కరోనా దవాఖానలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తొమ్మిది మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద సమయంలో దవాఖానలో 76 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 23 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
దవాఖానలో ఉన్న 70 మంది రోగులను మరో హాస్పిటల్కు తరలించామని ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ తెలిపారు. అందులో కరోనా బాధితులు కూడా ఉన్నారని వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ మాల్లో దవాఖానను చూడటం ఇదే మొదటిసారి. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అగ్ని ప్రమాదంలో ఇద్దరు మరణించారని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దవాఖానలో ఉన్న 76 మంది రోగులను కొవిడ్ కేర్ దవాఖానకు తరలించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో మాల్లోని మొదటి అంతస్థులో లెవల్3 లేదా లెవల్-4 మంటలు చెలరేగాయి. సుమారు 23 ఫైర్ఇంజన్లు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.