ఆదిలాబాద్: జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నారిలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున హేమంత్ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. మిల్లులో కొన్ని రోజులుగా సేకరించిన పత్తిని బేళ్లుగా మార్చి నిల్వ ఉంచారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బేళ్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదవల్ల భారీగా నష్టం వాటిల్లిందని, నష్టాన్ని అంచనా వేస్తున్నామని సిబ్బంది తెలిపారు.