హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ శివార్లలోని కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కుషాయిగూడలోని ఓ కూలర్ల దుకాణంలో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఐదు దుకాణాలకు వ్యాపించాయి. రోడ్డు పక్కన ఆగిఉన్న డీసీఎంకు మంటలు అంటుకున్నాయి. దీంతో షాపులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలాన్ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం వల్ల భారీగా నష్టపోయామని వ్యాపారులు వాపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్