చండీఘఢ్ : పంజాబ్ ఎమ్మెల్యే, లోక్ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ సిమర్జిత్ సింగ్ బైన్స్పై 44 ఏండ్ల మహిళ ఫిర్యాదు మేరకు లైంగిక దాడి కేసు నమోదైంది. ఎమ్మెల్యేపై లైంగిక దాడి ఇతర అభియోగాలపై కేసు నమోదు చేయాలని పంజాబ్ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఫిర్యాదుదారు దరఖాస్తును ఎఫ్ఐఆర్గా మలిచి క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే దర్యాప్తు నిర్వహించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. తనపై ఆతం నగర్ ఎమ్మెల్యే సిమర్జిత్ సింగ్ లైంగిక దాడికి పాల్పడ్డారని భర్తను కోల్పోయిన ఒంటరి మహిళ కొన్ని నెలల కిందట ఫిర్యాదు చేశారు.