అమరావతి : అతివేగం కుటుంబంలో ఇద్దరిని బలిగొంది. బైక్ అదుపుతప్పి ట్రాక్టర్ కిందపడి తండ్రీకుమారులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం వద్ద ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను కొండెబోయిన కొండల్ (34), శివనాగరాజు (13)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల కుటుంబీలకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని ప్రమాదంలో తండ్రీకుమారులిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.