సంగారెడ్డి, ఏప్రిల్ 11: విద్యతోనే సమానత్వం వస్తున్నదని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని సం గారెడ్డి జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. పూలే విగ్రహానికి అదనపు కలెక్టర్ రాజర్షి షా, అదనపు ఎస్పీ సృజన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా మన్ననలు అందుకున్న గొప్ప మానవతవాది పూలే అని కొనియడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా వెకనబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి కేశురాం, జడ్పీ సీఈవో ఎల్లయ్య, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు, ఆర్డీవో మెంచు నగేశ్, టీన్జీవో సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు రాజేందర్, సుశీల్బాబు, నర్సింలు, మాజీ సీడీసీ విజయేందర్రెడ్డి, బీసీ సంఘం నాయకులు బీరయ్యయాదవ్, మాణిక్యం, అడివయ్య, జయరాజు, రాములు, అనంతయ్య, బాలరాజు, శివకుమార్, బీసీ సంక్షేమశాఖ సిబ్బంది, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జిల్లా గౌడ సంఘం, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి, టీపీటీఎఫ్, ఓబీసీ ఉద్యోగ సంఘం, టీపీటీఎఫ్, ఓబీసీ ఉద్యోగ సంఘం, మార్పుకళా మండలి ఆధ్వర్యంలో మహాత్మాజ్యోతి రావు పూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పూలే సామాజిక దార్శనికుడు:మెదక్ కలెక్టర్ హరీశ్
మెదక్, ఏప్రిల్ 11 : కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం శ్రమించిన తీరు, వారు ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని కొనియాడారు. పూలే జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, బీసీ సంక్షేమాధికారి జగదీశ్వర్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంగారాం, ప్రధాన కార్యదర్శి మల్లేశం, కార్యదర్శి సిద్ధి రాములు పాల్గొన్నారు.
ఆదర్శప్రాయుడు పూలే:ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
అందోల్, ఏప్రిల్ 11: మహాత్మాజ్యోతిరావు పూలే నేటి సమాజానికి ఆదర్శప్రాయుడని ఎమ్మె ల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం పూలే జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లికార్జున్గుప్తా, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, మాజీ ఏఎంసీ చైర్మన్లు నారాయణ, నాగభూషణం, మండల అధ్యక్షుడు వెంకటేశం, లక్ష్మీకాంత్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
అది దారుణ హత్యాకాండ.. కూచ్బిహార్ కాల్పులపై మమతాబెనర్జి
బడుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్రలో ఈ రోజు
జానారెడ్డి.. ప్రజలకు గుర్తుండే పని ఒక్కటైనా చేశావా?