హైదరాబాద్ : భదాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం హనుమాన్బస్తీలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంలో విచక్షణ కోల్పోయిన యువకుడు తండ్రిని రోకలితో కొట్టి పాశవికంగా హతమార్చాడు. హనుమాన్బస్తీకి చెందిన కొమురయ్య (61) కుమారుడు శివప్రసాద్ మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం తరచూ తల్లిదండ్రులను వేధిస్తుండే వాడు. ఈ క్రమంలో ఈ ఉదయం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తండ్రి కొమురయ్యను పట్టుబట్టడంతో నిరాకరించాడు. దీంతో తీవ్ర ఆగ్రవేశానికిలోనైన శివప్రసాద్ రోకలితో కొట్టి తండ్రిని కడతేర్చి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.