ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో కుమారుడు.. తండ్రిని బండరాయితో కొట్టి హతమార్చాడు. ఎస్సీ కాలనీకి చెందిన బొందాలు (71) కుమారుడు సురేశ్ మద్యానికి బానిసై జులాయిగా తీరుగుతున్నాడు. ఇవాళ సాయంత్రం పూటుగా మద్యం సేవించి మత్తులో తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రవేశానికిలోనై తండ్రిని బండరాయితో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.