రంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద సంఘట జిల్లాలోని మంచాల పోలీస్ స్టేషన్ పరిధి కొర్రవాని తండా-సత్యం తండా గ్రామాల మధ్య చోటు చేసుకుంది. మంచాల ఎస్ఐ రామన్ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఎల్లమ్మ తండా గ్రామానికి చెందిన సపావట్ చందర్ నాయక్ (65) తన కొడుకు హరిని తీసుకొని పని నిమిత్తం లోయపల్లి వెళ్లి తిరిగి వస్తున్నాడు.
ఈ క్రమంలో కర్రవాని తండా సమీపంలోకి రాగానే రంగాపూర్ నుంచి వస్తున్న టాటా ఏస్ వాహనం ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీ కొడులులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలిస్తుండగా చందర్ మార్గ మధ్యలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం