అమరావతి : అనుమానాస్పదంగా తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడ సత్యనారాయణపురం పరిధిలోని శ్రీనగర్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమా.? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి