సూర్యాపేట : అకాల వర్షం జిల్లాలో బీభత్సం సృష్టించింది. చివ్వేంల మండలం మొగ్గయ్య గూడెం ఆవాసం రోళ్ల బండ తండాలో పిడుగు పడి రైతు దరావత్ హరిశ్చంద్రు మృతి చెందాడు. అలాగే పెన్ పహాడ్ మండల పరిధిలోని చీదేళ్ల గ్రామంలో రాళ్ల కురియడంతో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. అకాల వర్షంతో కోతకు వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. నడిగూడెం మండలం రత్నవరంలో పిడుగుపాటుకు 18 గొర్రెలు, మేకలు మృతి చెందాయి.
ఇవి కూడా చదవండి..
సూర్యాపేట జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం
స్వీయ నియంత్రణయే శ్రీరామ రక్ష : మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
కరోనా సెకండ్ వేవ్ మోదీ సృష్టించిన విపత్తు: మమతాబెనర్జి