బోనకల్లు: బోనకల్లు మండలంలో ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. తూటికుంట్ల గ్రామానికి చెందిన నల్లమోతు రామారావు(56) బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేయడానికి మండల కేంద్రమెయిన బోనకల్లు వచ్చాడు. బ్యాంకులో తన ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకొని ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో రోడ్డుపక్కనడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు గమనించి అతని వద్దకు వెళ్లేలోపు అప్పటికే మృతిచెందాడు.