నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన ప్రముఖ మెజీషియన్ రాములు(55) కరోనాతో మృతి చెందాడు. గత కొంత కాలంగా కుటుంబ సభ్యులతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆయన లాక్ డౌన్ కారణంగా స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో కరోనాతో బాధపడుతూ నాగర్ కర్నూల్ ప్రభుత్వ దావాఖనలో చేరాడు. ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడంతో మంగళవారం మధ్య రాత్రి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
రాములు మెజీషియన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు పొందడమే కాకుండా రాష్ట్రస్థాయి అవార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు