జనగామ : జనగామ జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం లేదని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన అడ్వకేట్ సాధిక్ అలీపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు..దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు సరిగా అందించడం లేదని సోషల్ మీడియాలో సాధిక్ అలీ తప్పుడు ప్రచారం చేయడంతో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పుజారి రఘు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జనగామ కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సాధిక్ అలీపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూతూ.. ప్రభుత్వ ఆర్డర్ను బద్నాం చేసే విధంగా సాధిక్ ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందని సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేశాడన్నారు. దవాఖానలో ఆక్సిజన్ కొరత రావడంతో తన తల్లి కోసం సొంతంగా తెచ్చిన ఆక్సిజన్ సిలిండర్ రోగులకు ఇస్తున్నట్లు సాధిక్ అలీ తప్పుడు ప్రచారం చేసుకున్నాడని తెలిపారు.
సాధిక్ అలీ చేసిన తప్పుడు ప్రచారంతో ప్రజలు అయోమయానికి గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాది సాధిక్పై కేసు నమోదు చేశామన్నారు. విచారణ తదుపరి నివేదికలను మెజిస్ట్రేట్ కు సమర్పిస్తామని సీఐ తెలిపారు.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ