హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు చివరకు పోలీసుల పేరిట మోసాలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఎస్హెచ్వో మాదాపూర్ పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించారు. ఆ తర్వాత ఫేస్బుక్ మెసేంజర్లో చాట్ చేసి వాట్సాప్ నంబర్లు సేకరించారు. పోలీసుల పేరుతో వాట్సాప్ చాట్ చేసి డబ్బులు అడిగారు నిందితులు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.