మెహిదీపట్నం :మంత్రశక్తులతో వశీకరణ చేస్తానని,కష్టాలను దూరం చేస్తానంటూ అమాయకులకు కుచ్చుటోపి పెడుతున్న ఓ నకిలీ బాబాను ఆదివారం హబీబ్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం….మల్లేపల్లి మాంగార్ బస్తీలో నివసించే ఎండీ.ఉస్మాన్,సల్మా బేగంలు అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బులు దండుకుంటున్నారు.
స్థానికంగా నివసించే ఓ యువకుడు దీనిపై హబీబ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో హబీబ్నగర్ పోలీసులు వీరిద్దరిపై నిఘా పెట్టి ఆదివారం సాయంత్రం పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.