ఘట్కేసర్, జూన్ 29 : ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఘట్కేసర్ మున్సిపాలిటీలో రూ. 77.50 లక్షలతో పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు చైర్పర్సన్ ముల్లిపావనీ జంగయ్య యాదవ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1నుంచి ప్రారంభమయ్యే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ , ప్రజా ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో నిర్వహించే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు.
పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమంలో జిల్లాలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేసి నాటించే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్లు సంగీతా ప్రభాకర్రెడ్డి, వసంత, ఆంజనేయులు, రమాదేవి, వెంకట్రెడ్డి, మల్లేశ్, నర్సింగ్రావు, రవీందర్, కమిషనర్ వసంత, పోచారం మున్సి పాలిటీ చైర్మన్ కొండల్రెడ్డి, మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, రైతు సొసైటీ అధ్యక్షుడు ఎస్.రాంరెడ్డి, నాయకులు ,అధికారులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, జూన్ 29 : ఘట్కేసర్ మండల పరిధి… వెంకటాపూర్, ఎదులాబాద్, మర్పల్లిగూడ, మాదారం గ్రామాల్లో వైకుంఠ ధామాలను మంత్రి మల్లారెడ్డి ఎంపీపీ సుదర్శన్రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు.
క్రీడలతోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధ్యం అవుతున్నదని మంత్రి తెలిపారు. మండల పరిధి మాదారంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి మల్లారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, శ్రీవిద్య ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దాసారపు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జంగమ్మ, ఎంపీడీవో అరుణ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ రమేశ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కుమార్, ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు, సర్పంచ్లు గీతా శ్రీనివాస్, మంగమ్మ, సురేష్, యాదగిరి, ఎంపీటీసీలు రామారావు, సరళ కుమార్, శోభారాణి, ఉప సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘట్కేసర్, జూన్ 29 : పోచారం మున్సిపాలిటీ నారపల్లి గ్రామానికి చెందిన అనంతలక్ష్మికి సీఎం సహాయనిధి నుంచి రూ.25వేల చెక్కు మంజూరైంది.ఈ చెక్కును లబ్ధిదారుడి కుటుంబసభ్యులకు మంత్రి మల్లారెడ్డి అందజేశారు. పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
శామీర్పేట, జూన్ 29 : మూడుచింతల్పల్లి మండలం జగ్గంగూడ గ్రామానికి చెందిన ఎల్ల గణేష్కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.47,500 చెక్కును మంగళవారం మంత్రి మల్లారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ విష్ణువర్ధన్రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, రైతుబంధు శామీర్పేట మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, జగ్గంగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎల్ల కుమార్, చెవ్వ రమేశ్, మురళీగౌడ్,శివ, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.