గౌహతి: ఒక బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని నాగాన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇంటి పనులు చేసే 12 ఏండ్ల బాలిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కొందరు ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు అది ఆత్మహత్య కాదు హత్య అని అనుమానించారు. ఇంటికి వెళ్తానని యజమానిని కోరిన బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు తెలుసుకున్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ దారుణానికి పాల్పడిన ప్రకాష్ బోర్తాకుర్, అతడ్ని కుమారుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మరణించిన బాలిక మోకాలిపై కూర్చొని మంటల్లో కాలిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.