టాలీవుడ్లో ఇప్పటికే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకున్న పూజా హెగ్డే బాలీవుడ్లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. రోహిత్ షెట్టీ ‘సర్కస్’ చిత్రంలో భారీ తారాగణంతో నటిస్తున్నది. షేక్స్పియర్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ ముందువరకూ కొనసాగింది. ఇందులో రణ్వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, వరుణ్ శర్మతో కలిసి నటిస్తున్నది పూజా. సర్కస్ షూటింగ్ ఫుల్ జోష్ నింపిందని చెబుతున్నది..
“సర్కస్ సెట్లో నవ్వులే నవ్వులు! అసలు మేం షూటింగ్లో ఉన్నామా! అనిపించేది. లొకేషన్లో జోకులకు నవ్వలేక పడిపోయేవాళ్లం. ముఖ్యంగా రణ్వీర్. ఆయన ఎనర్జీ అంతా ఇంతా కాదు! ‘రణ్వీర్ నుంచి నీకు ఏం కావాలి?’ అని ఎవరైనా అడిగితే, తన ఎనర్జీలో కొంత అప్పు ఇవ్వమంటాను. లొకేషన్కు వచ్చినప్పటినుంచి వెళ్లేవరకూ సేమ్ ఎనర్జీ మెయింటేన్ చేస్తాడు. ఊరికే ఉంటాడా అంటే, అదీ లేదు. చాలా యాక్టివ్. ప్రతి విషయాన్నీ బాగా అర్థం చేసుకుంటాడు. ప్రతి అంశాన్నీ చాలా నిశితంగా పరిశీలిస్తాడు. సర్కస్ మంచి మెమరీగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు” అన్నది పూజా.
“సల్మాన్తో ‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమాలో నటించనున్నాను. ఇప్పటి వరకూ నేను చాలామంది సూపర్స్టార్స్తో చేశాను. కానీ, సల్మాన్తో ఎలా మాట కలపాలో అస్సలు అర్థం కావడం లేదు. స్కూల్ డేస్ నుంచి హృతిక్ అంటే చాలా ఇష్టం. అనుకోకుండా ఆయనతో ‘మొహంజదారో’ సినిమాలో చేశాను. కెరీర్ మొదట్లోనే అయినా హృతిక్తో బాగా కనెక్ట్ అయ్యా. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేండ్లు అవుతున్నా సల్మాన్తో సినిమా అనగానే కొత్తగానే ఉంది’ అని తన ఫీలింగ్స్ను పంచుకున్నది పూజా హెగ్డే.