హైదరాబాద్ : నగరంలో తీన్మార్ మల్లన్నను నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 9న జయవర్ధన్ అనే కల్లు ముస్తాదారు మల్లన్న పాదయాత్ర పేరుతో తనను బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీస్ స్టేషన్ లో ఐదుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఫిర్యాదులో A1 ఉప్పు సంతోష్ ను 10వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. A5 గా ఉన్న తీన్మార్ మల్లన్నను గురువారం హైదరాబాద్లో అదువులోకి తీసుకుని రాత్రి నిజామాబాద్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి తిరిగి హైదరాబాద్కు పంపనున్నారు.
ఇవి కూడా చదవండి..
Crime News | ధనలక్ష్మిపై లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్టు
ముషంపల్లి ఘటన అమానుషం : మంత్రి జగదీష్ రెడ్డి
పెగాసిస్ వ్యవహారంపై విచారణకు టెక్నికల్ కమిటీ: సుప్రీంకోర్టు
Air Pollution | ప్రతి ఏటా 70 లక్షల మందిని చంపుతున్న వాయు కాలుష్యం: డబ్ల్యూహెచ్వో