జైపూర్ : మద్యం సేవించి మహిళ ఇంటికి వెళ్లి అమర్యాదకరంగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్పై అధికారులు వేటు వేసిన ఘటన రాజస్ధాన్లోని ఆల్వార్లో వెలుగుచూసింది. భివాడీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నిందితుడు మహిళతో కలిసి న్యూరో సెంటర్ నిర్వహిస్తున్నాడు. మహిళ తన సోదరితో కలిసి ఈ సెంటర్ను నడుపుతున్నారు. నిందితుడు బుధవారం మద్యం సేవించి న్యూరో సెంటర్లో ప్రవేశించాడు. దీంతో మహిళ నిందితుడిని అడ్డగించి అక్కడ నుంచి వెళ్లిపోవాలని కోరారు
. వ్యాపారంలో తన పెట్టుబడిని తిరిగి ఇచ్చేయాలని మహిళ పట్ల నిందితుడు దురుసుగా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగడంతో మహిళ పట్ల నిందితుడు అసభ్యకరంగా వ్యవహరించాడు. తిరిగి సాయంత్రం మహిళ ఇంటికి వెళ్లిన నిందితుడు ఆమెతో గొడవపడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన కానిస్టేబుల్పై 13 గంటల్లోనే చార్జిషీట్ను నమోదు చేశారు.