జూబ్లీహిల్స్, జూన్1: వర్షాకాలంలో సమస్యలు రాకుండా మాన్సూన్ బృందాలు పనులు చేపడతాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఈ బృందాల సభ్యులు సత్వరమే చర్యలు తీసుకుంటారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. మంగళవారం యూసుఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ సర్కిల్-19 పరిధిలో ఏర్పాటు చేసిన మాన్సూన్ బృందాల వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం సీజన్లో తలెత్తే సమస్యలను మాన్సూన్ బృందాల సభ్యులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని తెలిపారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయా బృందాలు వాహనాలతో పాటు వచ్చి సమస్య పరిష్కారానికి పనులు చేపడతారని వెల్లడించారు.
వర్షాలకు గుంతలు పడిన రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడతారని, వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా వాహనాల్లో సిద్ధంగా ఉండే ఇసుక, కంకరతో పనులు చేపడతారన్నారు. వర్షాకాలంలో వచ్చే సమస్యలను ప్రజలు స్థానిక కార్పొరేటర్లకు, బల్దియా సిబ్బందికి తెలియజేయాలని, మాన్సూన్ బృందాలు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటారన్నారు. యూసుఫ్గూడ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్యరావు, ఈఈ రాజ్కుమార్తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, జూన్ 1: వర్షాకాలం సమీపిస్తుండటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నగర మే యర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం బం జారాహిల్స్ డివిజన్ పరిధిలో మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అన్ని డివిజన్లలో మాన్సూన్ బృందాలను ఏర్పాటు చేశామని, వర్షపు నీరు నిలవకుండా చూడటంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా ఈ బృందాలు పనిచేస్తాయన్నారు.
శ్రీనగర్కాలనీ, జూన్ 1: వర్షాకాలంలో వచ్చే సమస్యల సత్వర పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన అత్యవసర బృందాలు నిరంతం అందుబాటులో ఉంటాయని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి అన్నారు. మంగళవారం బం జారాహిల్స్ రోడ్డు నంబరు-7లోని జీహెచ్ఎంసీ వార్డు కా ర్యాలయం వద్ద అత్యవసర బృందం సిబ్బంది, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అత్యవసర బృందం వినియోగించే వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈ దుర్గాప్రసాద్, ఏఈ ఆనంద్, వర్క్ఇన్స్పెక్టర్, నాయకులు పాల్గొన్నారు.