హైదరాబాద్ : ఫేస్బుక్లో ప్రేమ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ డాక్టర్ను మోసం చేశారు. మహిళా డాక్టర్ పేరుతో ఫేక్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించారు. ఆ తర్వాత డాక్టర్ నందకుమార్కు విలువైన బహుమతి పంపిస్తామని చెప్పి రూ. 24 లక్షలు కాజేశారు. ఢిల్లీ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు నందకుమార్కు ఫోన్ చేశారు. కస్టమ్స్ ఛార్జీల పేరుతో రూ. 24 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత వారు సమాధానం ఇవ్వకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించిన డాక్టర్ నందకుమార్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.