బులంద్షహర్: భూవివాదంతో కలత చెందిన ఓ డాక్టర్ ఆత్మహత్య ( Doctor suicide ) చేసుకున్నాడు. గత కొన్నేండ్లుగా సమస్య పరిష్కారం కాకపోగా తనభూమి ఇతరులపాలయ్యే పరిస్థితి నెలకొనడంతో ఆయన తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్షహర్ జిల్లా ఖుర్జా నగర పోలీస్స్టేషన్ పరిధిలో సారంగ్పూర్ గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం డాక్టర్ గౌరవ్ తన ఇంట్లోనే రివాల్వర్ కాల్చుకున్నాడు. దాంతో కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భూవివాదం పరిష్కారం కాకపోగా మరింత జఠిలమవడంతో గత కొన్ని రోజులుగా ఆయన డిప్రెషన్లో ఉన్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.