నల్లగొండ : జిల్లాలోని ప్రతి గ్రామంలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు కావాలని, వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు రావాలని డీఐజీ ఏవీ రంగనాధ్ అన్నారు. గురువారం నల్లగొండ టూ టౌన్ పోలీసులు, నల్లగొండకు చెందిన ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలోని నల్లగొండ ఓఅర్జీ ఆధ్వర్యంలో పానగల్లు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన కరోనా ఐసోలేషన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా లక్షణాలతో ఇండ్లలో ఐసోలేషన్ సొంతంగా ఐసోలేషన్ చేసుకునే వసతి లేని వారికి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఐసోలేషన్ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఐసోలేషన్ కేంద్రంలో సేవలు అందించడానికి ముందుకు వచ్చిన యువకులను అభినందించారు. ఐసోలేషన్ సెంటర్ల వల్ల కరోనా రోగులు సాధారణ ప్రజలకు దూరంగా ఉంటూ ఇతరులకు వ్యాప్తి చేసే అవకాశం ఉండదని, తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు.
పానగల్ ప్రాంతంలో చాలామంది కరోనా లక్షణాలతో ఉన్నట్లు ఇంటింటి సర్వే లో వెల్లడయిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. పానగల్ లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన నల్గొండ డాట్ ఓఆర్జి సభ్యులైన ప్రవాస నల్గొండ వాసులకు, 1,2 వార్డుల కౌన్సిలర్ లకు, స్థానిక యువకులను ఆయన అభినందనందించారు.
కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్.ఐ. నర్సింహులు, పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నితిన్ గౌతమ్, నల్గొండ డాట్ ఓఆర్జి సమన్వయకర్త, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ గుప్తా, మున్సిపల్ కౌన్సిలర్లు ఆలకుంట్ల రాజేశ్వరి మోహన్ బాబు, బుర్రి రజిత యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి