వెంగళరావునగర్ : పోటీగా దుకాణం పెడున్నాడనే కోపంతో దాడి చేసి, షాపు అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..తమిళనాడు రాష్ట్రం పుడుపట్టికి చెందిన ఎం.అసత్ జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ఎర్రగడ్డ డివిజన్..రాజీవ్ నగర్ ప్రాంతంలో హాట్ చిప్స్ దుకాణం పెట్టేందుకు దుకాణం అద్దెకు తీసుకుని ఏర్పాట్లు చేసుకున్నాడు.
అసత్ స్వగ్రామానికే చెందిన రాంకీ (31) కూడా అంతకుముందే మోతీనగర్ సమీపంలో హాట్ చిప్స్ వ్యాపారం చేస్తున్నాడు. అసత్ కొత్తగా షాపు పెట్టడం నచ్చని రాంకీ కోపంతో రాజీవ్నగర్కు చేరుకుని షాపుపై దాడి చేశాడు. అసత్ను దుర్భాషలాడి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. దీంతో బాధితుడు సోమవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రాంకీని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.