న్యూఢిల్లీ: తల్లి చెంపపై కుమారుడు కొట్టడంతో ఆమె కుప్పకూలి మరణించింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 75 ఏండ్ల అవతార్ కౌర్కు, పొరుగున్న ఉన్న మహిళ మధ్య పార్కింగ్ విషయంలోమంగళవారం గొడవ జరిగింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కుమారుడు రణబీర్ సర్దిచెప్పాడు. అనంతరం పొరుగువారితో గొడవకు దిగిన తల్లిని కుమారుడు, కోడలు మందలించగా వారి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో ఆగ్రహం చెందిన రణబీర్ తన తల్లి అవతార్ కౌర్ చెంపపై కొట్టాడు. దీంతో ఆమె కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ వృద్ధురాలు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఇదంతా ఇంటి ఆవరణలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో ఈ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు తల్లి మరణానికి కారణమైన కుమారుడు, అతడి భార్యపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.