హైదరాబాద్ : ప్రైవేట్ దవాఖానలకు టీకాల పంపిణీ నిలిపివేస్తూ శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటుకు వెంటనే టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు డీఎంహెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డోసులను వినియోగించుకోవచ్చని, మిగిలిన టీకాలను వెంటనే సేకరించాలని సీసీపీ వైద్యాధికారులను డీహెచ్ ఆదేశించారు.
జనవరి 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ దవాఖానల్లోనూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.