న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర అక్రమ ఆయుధ సిండికేట్ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. మేవత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆయుధాల వ్యాపారి ఇషాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 30 లైవ్ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల వ్యాపారి ఇషాబ్ మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పొందాడని, ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో వాటిని అక్రమంగా సరఫరా చేసినట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.