హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఈ వైరస్ నివారణకు మందు కనుగొనేందుకు శాస్ర్తవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీకాలకు తోడుగా ఓ మందును అందుబాటులోకి తెచ్చేందుకు శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారు.
పొలం గట్ల వద్ద పెరిగే ఓ మొక్కపై శాస్ర్తవేత్తలు దృష్టి సారించారు. ఆ మొక్క పేరే అడ్డ సరం. కరోనా వైరస్పై ఈ మొక్క ఏ మేరకు పని చేస్తుందనే విషయంపై ఢిల్లీలోని ఆయుర్వేద, రెస్పిరేటరీ రీసెర్చ్ సెంటర్ ఫర్ అప్లయ్డ్ డెవలప్మెంట్ అండ్ జీనోమిమ్స్, ఐజీఐబీ వంటి జాతీయ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి. అయితే ఈ మొక్క సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఆశలను రేకెత్తిస్తోంది.
కొవిడ్ బారిన పడిన రోగుల్లో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, రక్త గడ్డ కట్టడం, ఊపిరితిత్తులోని కణజాలం దెబ్బతినడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనడం చూస్తున్నాం. అయితే ఈ మూడు వ్యవస్థలను మెరుగుపర్చడంలో అడ్డసరం మొక్క దోహదపడుతుందని పరిశోధనల్లో తేలింది. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి తోడ్పడే జన్యువులకు సహాయపడే గుణాలు అడ్డసరం మూలికలలో ఉన్నాయని అధ్యయనం కనుగొంది. ఈ పరిశోధన పత్రం తాజాగా రెస్పిరేటరీ రీసెర్చ్ పబ్లికేషన్లో ప్రచురితం అయింది.
అడ్డసరం మొక్కు ఔషధ మొక్కగా ప్రాధాన్యం ఉంది. వీటి ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును మందుల తయారీలో విరివిగా వాడుతుంటారు. దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం నివారణ, చర్మవ్యాధుల చికిత్సలోనూ వినియోగిస్తారు. అడ్డసరము ఆకులను దగ్గుకు, ఉబ్బసానికి, రక్త శ్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడతారు.
ఇవి కూడా చదవండి..