హైదరాబాద్ : కూతురిని తండ్రి మందలించడంతో.. ఆమె అదృశ్యమైన ఘటన చందానగర్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో వెలుగు చూసింది. పాపిరెడ్డి కాలనీకి చెందిన ఓ యువతి (18) డిగ్రీ చేస్తోంది. ఆమె చదవకుండా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తుండటంతో తండ్రి మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. మంగళవారం నుంచి యువతి కనిపించకపోవడంతో.. గురువారం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే సదరు యువతి తన డైరీలో ఇలా రాసి వెళ్లిపోయింది. తన సొంతంగా తాను బతకగలగాలని పేర్కొన్నది. తన ఆచూకీ కోసం వెతకాల్సిన అవసరం లేదని తెలిపింది. కూతురి అదృశ్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.