చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ కరోనా టీకా తీసుకున్నారు. కూతురు సౌందర్య సమక్షంలో పీపీఈ కిట్ వేసుకున్న వైద్యుడు రజినికి టీకా వేశారు. తండ్రి, కూతురు ఇద్దరూ కోవిడ్ నిబంధనల మేరకు మాస్క్ ధరించారు. ఈ ఫొటోను, సమాచారాన్ని సౌందర్య స్వయంగా ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే ఏ టీకా వేసుకున్నారు? ఎన్నో డోసు? వంటి వివరాలేవీ అందులో లేవు. “మన తలైవర్ కరోనా టీకా వేసుకున్నారు. మనమంతా కలిసి కరోనాపై పోరాడుదాం” అనే సందేశాన్ని సౌందర్య ఆ ఫొటోకు జత చేశారు. రజని చిరకాల సహచరుడు, మిత్రుడు కమలహాసన్తో సహా అనేకమంది సినీరంగ ప్రముఖులు టీకా వేసుకుని ఆ సంగతి మీడియా ద్వారా వెల్లడించారు.